సాయిబన్న దాదా దర్గాలో నీటి ట్యాంకు ప్రారంభం

సాయిబన్న దాదా దర్గాలో నీటి ట్యాంకు ప్రారంభం

హోళగుంద,  న్యూస్ వెలుగు; మండల కేంద్రం నందు వెలిసిన మేల మరి సాయిబన్న దాదా దర్గా నందు సోమవారం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన త్రాగునీటి ట్యాంకును ప్రారంభించినట్లు సర్పంచ్ తనయుడు పంపాపతి, బుడ్డన్న, సింధువాళం కృష్ణయ్య, ఎర్రిస్వామి, నాగప్ప తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14, 15 తేదీలలో సాయి బన్న దాదా దర్గాలకు సంబంధించి ఉరుసు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే భక్తులు కర్ణాటక ప్రాంతం నుండి పెద్ద ఎత్తున తరలిరాడంతో భక్తులకు నీటి ఎద్దడి తలెత్తకుండా త్రాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దర్గా పురోహితులు కాలే సాబ్, కాజప్ప చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీరేష్, బాగోడి రామ, సింధువాళం మల్లి, సన్నన్ని, చాకలి మల్లికార్జున, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?

Thanks for your feedback!