
రాబోయే నాలుగు రోజులు వర్షాలే
న్యూస్ వెలుగు ఏపీ: అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో రాబోయే4రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఉరుములతో వర్షాలు పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదని సూచించారు.
సోమవారం అల్లూరి, కాకినాడ,కోనసీమ,తూగో, పగో,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!