కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి నారా లోకేష్

కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి నారా లోకేష్

అమరావతి(న్యూస్ వెలుగు): ఉండవల్లి నివాసంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులతో మంత్రి నారాలోకేష్ సమావేశం అయ్యారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అనంతరం పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి వారికీ భరోసా ఇచ్చారు. పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో టీడీపీ ఏజెంట్ గా నంబూరి శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారని ఆయన గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉంటామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!