
రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరుపై సమీక్షించిన సీఎం
ఏపి సచివాలయం (న్యూస్ వెలుగు): ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతీ పౌరుడికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే అంశాన్ని తనిఖీ చేస్తానని అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయి సహా రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరుపై నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, ఐటీ, ఆర్టీజీఎస్, ఎక్సైజ్, భూగర్భ జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!