
తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల
బేతంచెర్ల న్యూస్ వెలుగు : సిమెంట్ నగర్ గ్రామంలోపాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న కాలనీలోని15 ఏళ్ల నాటి నుండి ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు సంతోషంగా ఉందని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన పైపులైను పరిశీలించి కుళాయిలతో తాగునీటి సరఫరాను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలనీ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోమండల కన్వీనర్ ఎల్ల నాగయ్య,పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి,సీనియర్ నాయకులు పోలూరు రాఘవరెడ్డి,భీమేశ్వర్ రెడ్డి,అంబాపురం సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్,ఆర్ బుక్కాపురం సర్పంచ్ నాగరాజ్,గ్రామ నాయకులు సుభాన్,చిన్న రాముడు,రాజేష్,టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

