
ఇక ఆన్లైన్లోనే వైద్య సేవలు…సరికొత్త యాప్ ను రూపకల్పన చేసిన పృథ్వి రాజ్
న్యూస్ వెలుగు ( కర్నూలు ): ఈ ఆశ ఓపి యాప్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాలను సులభతరం చేసేందుకుగాను ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పృథ్వీరాజ్ తెలిపారు. కర్నూలు కెవి సుబ్బారెడ్డి కాలేజీ ప్రాంగణంలో ఈ యాప్ ను ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డితో లాంచ్ చేయడం జరిగిందని వారు వెల్లడించారు.

దీనివల్ల సమయం ఆదా అవుతుందని ప్రత్యేక సమయాల్లో ఎంచుకొని అదే సమయంలో డాక్టర్ని సంప్రదించి తమ ఆరోగ్య వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ యాప్ లో ఒక్కసారి నమోదైన వారికి లైఫ్ టైం సర్వీసులను అందించడం జరుగుతుందని.. రోగులు తమ రిపోర్టులను సైతం ఇందులో పొందుపరచుకునేలా ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు నిర్వాహకులు పృథ్వీరాజ్ సంప్రందించండి సెల్:
6301680400

Was this helpful?
Thanks for your feedback!

