
జాతీయ స్థాయి చిత్రలేఖన పోటిల్లో 15 గోల్డ్ మెడల్స్
- జాతీయ స్థాయి చిత్రలేఖన పోటిల్లో 15 గోల్డ్ మెడల్స్,
- 02 సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులు
- జాతీయస్థాయి చిత్రలేఖన పోటిల్లో విద్యార్థుల ప్రతిభ పై నంద్యాలలో అభినందనలు
నంద్యాల జిల్లా మార్చి 16 : (న్యూస్ వెలుగు ) నంద్యాల లోని కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయి చిత్రలేఖన పోటిల్లో అత్యంత ప్రతిభని చూపి అనేక పతకాలు సాదించారాని అకాడమీ నిర్వహకులు ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ లోని డ్రీమ్స్ ఆర్ట్ అకాడమీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో 13 వ జాతీయ స్థాయిలో యూత్, మరియు చిల్డ్రన్స్ చిత్రలేఖన పోటీలు, ప్రదర్శన ఫిబ్రవరి 28 న తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు రెండు వేల మంది పైగా విద్యార్థులు వేసిన చిత్రాలు వచ్చాయి. మా ఆర్ట్ అకాడమీ నుండి 30 మంది విద్యార్థులు వేసిన చిత్రాలను పంపినామని తెలిపారు. అందులో 17 మంది విద్యార్థులు మెడల్స్ సాధించారు.15 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ సాధించగా, ఇద్దరు సిల్వర్ మెడల్స్ సాధించారు. డ్రీమ్స్ ఆర్ట్ నిర్వాహకులు పి. రమేష్ విద్యార్థుల ప్రతిభని అభినందనలు తెలుపుతూ.. మెడల్స్, సర్టిఫికెట్స్ కొరియర్ ద్వారా పంపించారు. ఆదివారం స్థానిక ఆర్ట్ అకాడమిలో అభినందన సభను ఏర్పాటు చేసి విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశామనీ తెలిపారు. ఇన్ని పతకాలు మా విద్యార్థులకు రావడం చాలా సంతోషం గా వుంది. మా విద్యార్థులకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుచున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించిన పి. రమేష్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బంగారు పతకాలు సాధించిన వారిలో ప్రత్యూష, తేజశ్రీ, కాత్యాయిని , క్షీరజా రెడ్డి, రాగవైష్ణవి, లక్ష్య సాయి, లాస్యశ్రీ, బాదుల్ల సాయి, శ్రేష్ట, నీతూకృష్ణ శ్రీ,సాయి హవీష్, వేదగ్న, జోషిక రెడ్డి, కోమల్ కార్తీకేయ, షణ్ముకి వాసవి, సిల్వర్ మెడల్స్ పునీత్, సాత్విక్ వున్నారు.

