
నిత్యావసర సరుకులు పంపిణి చేసిన మరియా చారిటబుల్ ట్రస్ట్
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు ; ఈ సందర్బంగా మరియా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కేసీ పాములేటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని విజయవాడ నగరం అజిత్ సింగ్ కాలనీలో పది రోజుల నుండి వర్షాలు కారణంగా ముంపుకు గురైన వరద బాధితుల కోసం మరియా చారిటబుల్ ట్రస్ట్ కమటీ జమ్మలమడుగు ప్రాంతాల్లో అనేక మంది ప్రజల వద్ద నుండి విరాళాలు సేకరించి బాధితులకు అవసరమైన పది నిత్యావసర సరుకులు పంపిణి చేయటం జరిగింది. మరియా చారిటబుల్ ట్రస్ట్ పేద వారికీ సహాయం చేయటంలో ముందు ఉంటుంది అన్ని అయన తెలిపారు. విజయవాడ ముంపు బాధితుల కోసం విరాళాలు ఇచ్చిన ప్రతి ఒకరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈకార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మంచాల పుష్పరాజు, జగదీశ్, అనిల్, రాజు, నవీన్, జాన్ సన్ తరిధులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist