
వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై వుండాలి
కర్నూలు ,న్యూస్ వెలుగు: కర్నూలు నగరం లోని జొహరాపురం రోడ్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ లో శ్రీ వరసిద్ధి వినాయక బృందం ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక పూజ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా కర్నూలు ఎం.పీ .పంచలింగాల నాగరాజు హాజరైనారు ఈ సందర్బంగా ఎం.పీ నాగరాజు మాట్లాడుతూ ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ,వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ,భక్తి ప్రపత్తులతో తొమ్మిది రోజులు కార్యక్రమాలు చేస్తున్న కమిటీ వారిని అభినందించారు ఈ కార్యక్రమం లో జిల్లా కురువ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు టి .శ్రీలీల,జిల్లా కురువ సంఘము నాయకులు ఎం .కే .రంగస్వామి కే .సి .నాగన్న ,కే .మద్దిలేటి ,తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist