
రష్యా ఆర్మీ నుంచి 35మంది విడుదల
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన నుంచి ఇప్పటి వరకు 35 మంది భారతీయులను రష్యా ఆర్మీ నుంచి విడుదల చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది. MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, దాదాపు 50 మంది భారతీయ పౌరులు ఇప్పటికీ రష్యా సైన్యంతో ఉన్నారని, వీలైనంత త్వరగా వారిని విడుదల చేసేందుకు న్యూఢిల్లీ శ్రద్ధగా కృషి చేస్తున్నదని చెప్పారు. దీంతో ప్రధాని పర్యటనకు ముందే 10 మంది భారతీయులు డిశ్చార్జ్ కావడంతో మొత్తం విడుదలైన భారతీయుల సంఖ్య 45కి చేరింది.