
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: వాహనదారులు తప్పక ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తుగ్గలి ఎస్ఐ కృష్ణమూర్తి తెలియజేశారు. మంగళవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి నందు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎస్సై తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారికి జరిమానాలు విధించి,ట్రాఫిక్ నిబంధనల పట్ల వారికి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా మైనర్లు వాహనాలను నడిపితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలకు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఆటో నందు కూడా పరిమితి నుంచి ప్రయాణికులు ప్రయాణించరాదని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!