క్రీడా సామగ్రిని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి

క్రీడా సామగ్రిని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి

పిఠాపురం : విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేలా పాఠశాలలకు క్రీడా సామగ్రి పంపిణీ పిఠాపురం నియోజకవర్గంలోని 32 ప్రాథమిక ఉన్నత పాఠశాలాల్లో చదువుతున్న విద్యార్థులకు, క్రీడల్లో ప్రోత్సాహం అందించేలా ప్రతి పాఠశాలకు రెండేసి చొప్పున, క్రీడా సామాగ్రి కిట్లు అందించాలని నిర్ణయం తీసుకున్న ఉపముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ఒక్కొక్క కిట్ దాదాపు 25 వేల రూపాయలు, మొత్తం కిట్ల కు 16 లక్షల రూపాయలు అవసరం ఉండటంతో, కిట్లకు అవసరమైన నిధులను CSR ఫండ్స్ ద్వారా సేకరిస్తామని జిల్లా కలెక్టర్ S. షాన్మోహన్ గారు తెలియజేశారు. పాఠశాల దశ నుండే విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం అందించేందుకు ఇవి సహాయపడతాయని, దీని ద్వారా వారు క్రీడల్లో రాణించేందుకు వీలుంటుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలకు అండించబోయే కిట్ల నాణ్యతను  క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!