
నేడు దేవరగట్టుకు ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి రాక
హోళగుంద, న్యూస్ వెలుగు: నేడు ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి దేవరగట్టుకు వస్తున్నట్లు శుక్రవారం వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా పాత్రికేయులకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా బన్ని ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లెశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిమిత్తం ఎమ్మెల్యే దేవరగట్టుకు వస్తున్నారని తెలిపారు.కావున మండల వైసిపి సీనియర్ నాయకులు,మండల కో-కన్వీనర్,జెడ్పిటిసి,ఎంపిపి,వైస్ ఎంపీపీ,యువ నాయకులు,అన్ని గ్రామాల ఎంపీటీసీలు,సర్పంచులు,సచివాలయ కన్వీనర్లు,బూత్ కన్వీనర్లు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda