భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే  గ్రామసభలు: ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్

భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే గ్రామసభలు: ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్

బండిఆత్మకూర్ న్యూస్ వెలుగు: భూ రీసర్వే సమస్యల పరిష్కారానికి గ్రామసభలు ఏర్పాటు చేశామని బండి ఆత్మకూరు ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాకునూరు గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు.సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ
గత ప్రభుత్వంలో రైతుల భూములను భూ రీసర్వే పూర్తి చేయడం జరిగిందని అయితే భూ రీసర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తుమన్నారు. రైతులకు భూ సమస్యలు ఏమైనా ఉంటే గ్రామసభ ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకోవాలని కోరారు. కాకునూరు గ్రామంలో 89 అర్జీలు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ రవీంద్ర పాల్ మండల సర్వేయర్ పర్వీన్, గ్రామ సర్వేయర్ రహిమాన్ వీఆర్వో వెంకటేశ్వర్లు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!