సరి కొత్తగా రేషన్ కార్డులు!

సరి కొత్తగా రేషన్ కార్డులు!

అమరావతి, న్యూస్ వెలుగు; రేషన్ కార్డులు కొత్త డిజైన్లతో అందుబాటులోకి రానున్నాయి. గతంలో జగన్ చిత్రలతో ముద్రించిన బియ్యం కార్డుల స్థానంలో కొత్త సంకేతికత జోడించి కార్డులు ముద్రించి ఉచితంగా అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రేషన్ కార్డులు కొత్త డిజైన్లతో అందుబాటులోకి రానున్నాయి. గతంలో జగన్ చిత్రాలతో ముద్రించిన బియ్యం కార్డుల స్థానంలో కొత్త సాంకేతికత జోడించి కార్డులు ముద్రించి ఉచితంగా అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజా సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈమెరకు త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. ఇందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అర్హులందరికీ 45 బియ్యం అందజేస్తుంది దీంతో ఐరన్ లోపం నివారణకు ఆస్కారం కలుగుతుంది. అదేవిధంగా కార్డుల ఆధునికంగా తయారుచేసి పేదలకు ఇవ్వాలని సంకల్పం కాగా ఇవన్నీ మున్ముందు ఏర్పాటు చేయబోయే రైస్ ఏటీఎంలకు అనుసంధానంగా తీర్చిదిద్దనున్నాయి.

ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా
జగన్ సర్కారు రేషన్ కార్డులు అందజేయడంలో ఆలస్యం చేసింది కొత్త కార్డులకు 6 మాసాలు ఆగాల్సిన దుస్థితి కాగా కూటమి ప్రభుత్వం కొత్తజంటలకు వెంటనే కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే తీరుగా ఆహార భద్రత చట్టం 2013 అమలు మేరకు కార్డులు అంతల్సి ఉంది ఇందుకు గతంలో జగన్ వైఎస్ చిత్రాలతో కార్డులు ఉండగా వాటిని తొలగించనుంది.
కొత్తజంటలకు కార్డులు
కొత్తగా పెళ్లయిన వారికి కార్డులు ఇవ్వాలని నిర్ణయం అమలులో ఉండగా అర్హులేన అందరికీ కొత్తగా కార్డులు ఇవ్వనున్నారు. తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి ఒంటరిగా ఉన్న వారికి రేషన్ కార్డులు దక్కన్ ఉన్నాయి. క్యూఆర్ కోడ్ తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో కూడిన కార్డులు ఇవ్వనున్నారు.
రైస్ ఏటీఎం ల ఏర్పాటు
ఇప్పటికే చౌక దుకాణంలో యూపీ ఒడిస్సా రాష్ట్రాల్లో రైస్ ఏటీఎంలో ప్రారంభించారు. అక్కడ లబ్ధిదారులకు ఊరగా ఉంది. వర్షం లేకుండా నిమిషాల్లో సరుకులు తీసుకుని అవకాశం కలిగింది ఇదే చిరుగా ఇక్కడ రైస్ ఏటీఎంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Author

Was this helpful?

Thanks for your feedback!