
కొత్తపల్లె గ్రామంలో పొలము పిలుస్తోంది కార్యక్రమం
మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలం లోని కొత్తపల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రొండా అరుణమ్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సాగు చేసిన ప్రత్తి,కంది పంటలను పరిశీలించి తగు సూచనలు సలహాలు అందించినట్లు తెలిపారు.ముఖ్యంగా ప్రత్తి పంట గులాబీ రంగు పురుగు ఉధృతి ఉంది అని తెలిపారు.దీని నివారణకు దయోడి కార్బ్ 1.6 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఒక ఎకరానికి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి.అలాగే పురుగు ఉధృతి ని అదుపులో ఉంచుకొనుటకు పొలములో పక్షి స్థావరాలు పంట కు ఒక అడుగు ఎత్తులో పెట్టుకోవాలి.రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకుంటే మంచి పలితం ఉంటుంది అని తెలిపారు. అలాగే కంది పంట,మొగ్గ మరియు పూత దశలో ఉంది అని పచ్చ పురుగు ఉదృతి అధికంగా కనిపిస్తోంది అని తెలిపారు.వాతావరణం లో మార్పులు ఉండటం వలన పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తుంది అని తెలిపారు. ముందుగా వేప నూనె 5 యమ్.యల్.మరియు కొద్దిగా సర్ప్ పౌడర్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.అసిఫెట్ కూడా ఒక లీటరు నీటిలో 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే పచ్చ పురుగు నివారణకు ఇమా మెక్టిన్ బెంజిట్ ఒక లీటరు నీటిలో 0.4గ్రాములు మందు కలిపి పిచికారి చేయాలి.లేదా క్లోరిపైరి పాస్ 2 యమ్.యల్.ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ప్రతి రైతు పాల్గొని ఆయా పంటల గురించి అవగాహన పొందాలి అని తెలిపారు.కంది పంటలో పూత మరియు కాయ దశలో పురుగు బారి నుండి పంట ను కాపాడుకుంటే మంచి దిగుబడి సాధించడం సులభం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వి ఏ ఏ పవన్ కుమార్ మరియు గ్రామ కూటమి నాయకులు యమ్.కరుణాకర్ రెడ్డి,మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు