
ఏ.ఆర్.టి. మందులు సక్రమంగా వాడి, జీవితకాలం పెంపొందించుకోండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
రోగిని ద్వేషించకూడదు రోగాన్ని మాత్రమే ద్వేషించాలి
జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి
కర్నూలు, న్యూస్ వెలుగు: హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడవలసిన అవసరం లేదని, ఏ.ఆర్.టి. మందులు సక్రమంగా వాడడం ద్వారా జీవితకాలం పెంపొందించుకోవటంతో పాటు, ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ డే – 2024 సందర్భంగా జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి
మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారు ఆత్మన్యూనత భావానికి గురి కావలసిన అవసరం లేదని, తెలిసి తెలియక హెచ్.ఐ.వి. బారిన పడినంత మాత్రాన కుంగిపోవలసిన పని లేదని, సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు కృషి చేస్తారని, అందువల్ల హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారు ధైర్యంగా ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో NHM DPMO డాక్టర్ ఉమ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, NCC అధికారి లెఫ్టినెంట్ రఘురాం, NCC 3rd ఆఫీసర్ గీతాంజిని, DSDO భూపతి, జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వెంకట రత్నం, NHM DPO విజయ రాజు, వైద్య, ఆరోగ్య శాఖ DEMO శ్రీనివాసులు, చంద్ర శేఖర్ రెడ్డి, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం DRP నాగరాజు, ప్రభుత్వ నర్సింగ్ కాలేజి, గీతాంజలి నర్సింగ్ కాలేజి, సిల్వర్ జూబిలీ కాలేజి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజి ఫర్ మెన్, KVR కాలేజి, ఉస్మానియా, శంకరాస్ కాలేజి విద్యార్థులు NSS, NCC వాలంటీర్లు, రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులు, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం, విజయ మహిళా మండలి, SREDS, VHS స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.