
క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ వెలుగు ఆగస్టు 12 : నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం ప్రభుత్వ

రోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గైనకాలజీ వార్డులోని రోగులకు హై-ప్రోటీన్ డైట్, ఇతర రోగులకు సాధారణ డైట్, విధుల్లో ఉన్న వైద్యులకు అవసరమైన ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రోగులకు నాణ్యమైన ఆహారం అందుతున్నదీ లేనిదీ నిర్ధారించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య విభాగం, సేవలపై సరైన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ సేవలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు. రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి రోగికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచిత వైద్య చికిత్స అందేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐసీయూ లో చికిత్స పొందుతున్న రోగుల బంధువులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉన్నందున, వారితో సిబ్బంది సౌమ్యంగా, ఓర్పుతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. రోగుల బంధువులకు పరిస్థితిని స్పష్టంగా వివరించి, వారికి అవసరమైన సమాచారం అందించేలా సిబ్బందికి క్రమం తప్పకుండా ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య సేవల నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులు, రోగుల సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పష్టం చేశారు.
Was this helpful?
Thanks for your feedback!

