
ఇంటర్ పరీక్షలకు 05మంది విద్యార్థులు గైర్హాజరు
నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జనరల్ జువాలజీ, ఎకనామిక్స్ పేపర్ పబ్లిక్ పరీక్షలను ఫ్లైయింగ్ స్క్వాడ్ పి. బాలచంద్రుడు, వారి బృందం తనిఖీ చేసినట్లు చిఫ్ సూపరిండెంట్ వెంకట నారాయణ తెలిపారు. వారు మాట్లాడుతూ.. జనరల్ జువాలజీ పేపర్ – II పరీక్షకు 79 మందికి గాను 78 మంది విద్యార్థులు, ఎకనామిక్స్ పేపర్ – II పరీక్షకు 82 మందికి గాను 81 మంది విద్యార్థులు , అదే విధంగా వొకేషనల్ పాథాలజీ పేపర్ – II పరీక్షకు 18 మందికి గాను 16 మంది విద్యార్థులు, హెల్త్ సెంటర్ మ్యానేజ్ మెంట్ పేపర్ – II పరీక్షకు 26 మందికి గాను 25 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 205 మంది విద్యార్థులకు గాను 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

