
కార్యకర్తలే పార్టీ అధినేతలు మంత్రి నారాలోకేష్
అనకాపల్లి న్యూస్ వెలుగు : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశాన్ని మంత్రి నారాలోకేష్ నిర్వహించారు. కార్యకర్తలకు భరోసా కాదు.. సమస్యలు పరిష్కరించేందుకు వచ్చానని కార్యకర్తలను ఇద్దేశించి మాట్లాడారు. సమస్యలు ఏమైనా ఉంటే కలిసికట్టుగా చర్చించుకుని పరిష్కరించుకుందామన్నారు. కూటమి ధర్మం పాటించే బాధ్యత తీసుకుంటామన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ అధినేతలు అనే మాటను శిరసావహిస్తూన్నట్లు తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తల సమావేశం అనంతరం మంత్రి నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను సమస్యలను ఆయా నియోజకవరల నాయకులూ ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!