విగ్రహ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి

విగ్రహ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు) : రాజధాని అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తు అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను సిఎం  నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో గురువారం  పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్మృతి వనానికి గత నెల 3వ తేదీన మంత్రి  నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్  డూండీ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS