
పది లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం: LE జ్ఞానేశ్వర్ గౌడ్
వెల్దుర్తి,( న్యూస్ వెలుగు): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో నాలుగో వార్డులో సిసి రోడ్డు నిర్మాణానికి రూ. 10 లక్షల రూపాయలతో భూమి పూజ చేసినట్లు టిడిపి మండల నాయకుడు L. E. జ్ఞానేశ్వర్ గౌడ్ తెలిపారు. ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వారు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు కృషి చేయడం జరుతుందన్నారు. ఈ కార్యక్రమం లో వెల్దుర్తి జడ్పిటిసి సుంకన్న, మాజీ జెడ్పిటిసి ఐజయ్య, ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు నవీన్ కుమార్ మాదిగ నాయకులు పాల్గొన్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!

